తాప్సి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'గేమ్‌ ఓవర్‌'. వై నాట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈనెల 14న విడుదలయింది. రెండో వారంలోనూ కలెక్షన్ల పరంగానూ ముందుకు దూసుకెళుతోందని చిత్ర నిర్మాతలు ఎస్‌.శశికాంత్‌, చక్రవర్తి రామచంద్ర తెలిపారు.

 

ఈ సినిమా చూసిన విమర్శకులంతా ప్రశంసిస్తున్నారని, ఇది ప్రేక్షకుల విజయం అని చెప్పారు. చిత్రం పబ్లిసిటీ ప్రారంభమైన నాటి నుంచే టీజర్‌, సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన లభించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

 

కథానాయిక తాప్సి మాట్లాడుతూ 'గేమ్‌ ఓవర్‌' ప్రేక్షకులకు ఓ సరికొత్త ధ్రిల్లింగ్‌ను కలిగిస్తుందని చిత్రం విడుదలకు ముందే నేను చెప్పాను. ఇప్పుడది నిజమైంది. అందరూ నా నటనను మెచ్చుకుంటున్నారు. దీనికి కారణం దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ నా పాత్రను తెరకెక్కించిన తీరు.

 

ఓ మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు. ఈ విజయం ప్రేక్షకులదే. నటిగా నా కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయిగా మిగిలిపోతుంది. ప్రతి ఒక్కరూ గుర్తించుకునే పాత్రను చేశాను' అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: