గత కొంత కాలంగా హీరో విశాల్ ని ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ముఖ్యంగా ఆయన నడిఘర్ సంఘం అధ్యక్షుడు అయినప్పటి నుంచి నిర్మాత మండలి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి చిన్న సినిమాలకు ఆదరణ లేకుండా పోతుందని..స్టార్ హీరోల సినిమాలకే విశాల్ ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల కొంత మంది నిర్మాతలు విశాల్ ఆఫీస్ కి తాళం వేయడం..ఆ తాళం బద్దలు కొట్టిన కేసులో విశాలు అరెస్ట్ కావడం జరిగాయి. తాజాగా విశాల్ పై సీనియర్ హీరో అరుణ్ పాండియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తి శివన్ హీరోగా, దర్శకుడిగా రూపొందిస్తోన్న చిత్రం 'దౌలత్'. ఎంబీ మహ్మద్ అలీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అరుణ్ పాండ్యన్, విశాల్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మద్య విశాల్ నిజస్వరూపం తనకు అర్థం అయ్యిందని..ఆ మద్య ఆయన నటించిన ‘అయోగ్య’సినిమా షూటింగ్ సమయంలో నిర్మాతను ఎన్నో ఇబ్బందులు పెట్టినట్లు తనకు తెలిసిందని, ముందు మనం నిజాయితీగా ఉండాలి. ఆ తర్వాతే పదవులలోకి రావాలి అన్నారు. అంతే కాదు నిర్మాతలను కాపాడుకుంటేనే భవిష్యత్ ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలని అన్నారు.