టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి. మే నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలిరోజు కాస్త మిక్స్డ్ టాక్ సంపాదించినప్పటికీ మెల్లగా రెండవ రోజు నుండి పుంజుకుని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు సాధిస్తూ ముందుకు సాగుతోంది. 

ఇకపోతే ఇప్పటికే కొన్నిచోట్ల నాన్ బాహుబలి రికార్డులు కొల్లగొట్టిన మహర్షి, ఒకటి రెండు చోట్ల మాత్రం బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా చేరుకుంటోంది. అయితే సినిమాలో కథ, కథనాలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు తమ సినిమాకు ఇంతటి విజయాన్నిఅందించారని నిర్మాతలు దిల్ రాజు, అశ్వినిదత్, పివిపి అంటున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ.107 కోట్లవరకు షేర్ కలెక్షన్ రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెపుతున్నారు. అయితే ఇది ఇప్పటివరకు విడుదలైన మహేష్ బాబు కెరీర్ లోనే అల్ టైం రికార్డ్ కలెక్షన్ అని వారు అంటున్నారు. 

ఇక ఇదివరకు మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను కూడా రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టినప్పటికీ ప్రస్తుతం మహర్షి వాటిని దాటేసి ముందుకు దూసుకెళ్లింది. ఇక ఈ సినిమా ఇచ్చిన అద్భుత విజయంతో తన తదుపరి 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు ను త్వరలో ప్రారంభించనున్నారు సూపర్ స్టార్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: