ఎం.ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీలో ధోని పాత్రలో నటించిన కియరా అద్వాని ఆ తర్వాత లస్ట్ స్టోరీస్ అంటూ బీటౌన్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమాలో నటించగా.. ఆ తర్వాత రాం చరణ్ తో వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ పట్టేసింది.


ప్రస్తుతం బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తెలుగులో సూపర్ హిట్టైన అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ గా వస్తున్న కబీర్ సింగ్ లో ప్రీతి పాత్రలో నటించింది కియరా అద్వాని. షాహిద్ కపూర్ కు జోడీగా నటించిన కియారా ఆ పాత్రలో మెప్పించిందని వార్తలు వస్తున్నాయి. 


రీల్ లైఫ్ లో లవ్, ఎఫెక్షన్ చూపిస్తున్న తను ఎప్పుడైనా ప్రేమలో పడ్డదా అన్న ప్రశ్న అడిగారట మీడియా వారు. లేదు కాదు అని చెప్పకుండా తను ఓ లవ్ ఫెయిల్యూర్ అని షాక్ ఇచ్చింది కియరా. 10వ తరగతిలో కియరా ఒకతన్ని ప్రేమించిందట. అతనితో ఫోన్ లో మాట్లాడేదట. అయితే ఇంట్లో వాళ్లు ఎక్సాం అని వారించినా సరే సీక్రెట్ గా అతనితో మాట్లాడేదట.    


అయితే అతను డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటాడట. అందుకే మేము విడిపోయామని చెప్పింది కియరా. అతని నుండి విడిపోయాక చాలా బాధపడ్డానని.. ఇంట్లోనుండి బయటకు కూడా రాలేదని చెప్పుకొచ్చింది కియరా అద్వాని. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం కష్టమైన పనే అని.. కొంతకాలానికి గాని మాములు మనిషిని కాలేదని అన్నది కియరా. మరి అప్పుడంటే తెలియక వదిలేశాడు మరి ఇప్పుడు ఈమె స్టార్ హీరోయిన్ కదా మళ్లీ వచ్చి కియరా మనసు గెలుస్తాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: