టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లేటెస్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్. యంగ్ హీరో నితిన్ నటించిన గత నాలుగైదు సినిమాలు వరుసపెట్టి అవుతున్నాయి. ఇక పూరి జగన్నాథ్ సినిమాల విషయానికి వస్తే చివరి ఏడు సినిమాలు ఒక దానిని మించిన డిజాస్టర్ మరొకటి అన్నట్టుగా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఇస్మార్ట్ శంకర్ ఈ ఇద్దరి కెరీర్ కు అత్యంత కీలకం. శంకర్ పై అటు పూరి.. ఇటు నితిన్ ఇద్దరు ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కావాల్సి ఉంది. కాస్త ఆలస్యంగా జూలై 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
జూలై 12 న రామ్, పూరి ఫ్యూచర్ ఎలా ? ఉండబోతుందో తేలిపోతుందని అందరూ ఉత్కంఠతో వెయిట్ చేస్తున్నారు. సినిమాపై ఇద్దరు ఫుల్ కాన్ఫిడెన్స్తో కనిపిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం భారత్నే కాకుండా ప్రపంచ క్రీడాభిమానులను ఊపు ఊపుతున్న ప్రపంచకప్ క్రికెట్ శంకర్ కు షాక్ ఇచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమా అయినా వారం రోజులకు మించి థియేటర్లలో నిలబడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ సినిమా మీద ఆశలతో ఉన్న రామ్, పూరికి వరల్డ్కప్ కాస్త టెన్షన్గానే మారింది.
ఈ క్రమంలోనే భారత్ ఫైనల్గా వెళితే శంకర్ను ముందుగా రిలీజ్ చేసినా ఎవ్వరూ పట్టించుకోరన్న భయం సినిమా యూనిట్ వాళ్లను వెంటాడుతోంది. అందుకే వన్ వీక్ వెనక్కు వెళ్తే బెటర్ అని డిసైడ్ అయిందట నిర్మాత చార్మీ టీమ్. ఆ మేరకు నిర్ణయం తీసుకుని జూలై 18 గురువారం డేట్ గా డిసైడ్ అయ్యారట.అయితే ఆ మరుసటి రోజు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ వస్తోంది. అంటే రామ్ వారం రోజులు ఆగినా ఆ తర్వాత విజయ్కు సైడ్ ఇవ్వక తప్పదు. వారం రోజుల్లోనే సినిమాకు టాక్ బాగుంటే మంచి వసూళ్లు వస్తాయి.