సినిమాలు కొన్ని సార్లు కొత్త పుంతలు తొక్కే రోజులివి. కొన్ని ప్రయోజనాత్మకాలు - సామాజిక సమస్యల ఇతివృత్తం కేంద్రంగా తయారయ్యేవి కొన్నైతే మరి కొన్ని నవ్యత్వం సెంట్రిక్ గా వచ్చేవి కొన్ని వీటిల్లో ప్రత్యేక ఆలొచనా ధోరణి ఇతివృత్తం అవుతుంది. అయితే ఇప్పుడు కోలీవుడ్లో చర్చ అంతా నటి అమలాపాల్ గురించే. అందుకు కారణం ఈ సంచలన నటి నటించిన "ఆడై" చిత్రం కథానాయకి కేంద్రంగా ఉన్న ఇతివృత్త చిత్రం. ఇంతకు ముందు 'మేయాదమాన్' వంటి సక్సెస్-ఫుల్ చిత్రం ద్వారా పరిచయం అయిన రతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రం "ఆడై" ఈ చిత్రం ఫస్ట్లుక్ పోస్టరే పెనుసంచలనానికి కారణమైంది. ప్రేక్షకుల్లో ఆశక్తి వెల్లువలా పొంగి పొరలింది.
ఆడై చిత్రం ఒక వ్యక్తి స్వేచ్ఛ, సంప్రదాయాల చుటూ తిరిగే ఇతివృత్తంతో కూడిన కథ. ఇందులో దుస్తులు లేకుండా ఒంటికి టాయిలెట్-పేపర్ చుట్టుకున్న మహిళ పాత్రలో అమలాపాల్ నటించగా ఆమె ఫొటోతో కూడిన ఆ పోస్టర్ విడుదలై ఆడై చిత్రంపై ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల విడుదల చేసిన ఆడై చిత్ర టీజర్ మరింత ప్రకంపనలను సృష్టిస్తోంది.
అందులో నటి అమలాపాల్ పూర్తి నగ్నంగా కూర్చుని ఏడుస్తున్న దృశ్యం చోటు చేసుకోవడమే కారణం. అలాంటి సన్నివేశంలో అమలాపాల్ ధైర్యంగా అంటే బోల్డ్ టైప్ లో నటించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. చిత్రంలో అలాంటి సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల కోసం నటి అమలాపాల్ దాదాపు 20 రోజులు దుస్తుల్లేకుండా నటించిందట. ఇది సాధారణ విషయం కాదు. అందుకు అమలాపాల్ ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
నటి సమంత వంటి తారలు అమలాపాల్ ను ఎంతగానో అభినందిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే "పలు మిలియన్ల ప్రేక్షకులు" వీక్షించడం విశేషం. ఇలా ఇంతకు ముందు ఏ చిత్రానికి రానట్టుగా "లైక్స్ రికార్డు స్థాయి" లో వచ్చాయట. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి "సెన్సార్ ఏ సర్టిఫికెట్" ను ఇచ్చింది.
ఆడై చిత్రం ఒక వ్యక్తి స్వేచ్ఛ, సంప్రదాయాల గురించి చర్చించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు అంటున్నారు. ఇందులో అమలాపాల్ నగ్నంగా నటించడం వంటి సన్నివేశాల తో పాటు, మోటార్ బైక్ నడపడం, విలన్లతో ఫైట్ చేయడం వంటి సాహసాలు చేసిందట. ఇది కచ్చితంగా ఆమె కేరీర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని ఆడై చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ చిత్రం త్వరలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది.