అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గా మజిలీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ చైతు కెరియర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో చైతు సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత నాగ చైతన్య వెంకీమామ సినిమా చేస్తున్నాడు.


వెంకీమామతో పాటుగా బంగార్రాజు సినిమాలో కూడా నాగ చైతన్య నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలే కాదు నాగ చైతన్య, శేఖర్ కమ్ముల డైరక్షన్ లో ఓ సినిమా వస్తుంది. ఈమధ్యనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు వచ్చింది. ఫిదా భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.


మజిలీ హిట్ తర్వాత చైతులో మంచి మార్పు వచ్చినట్టు తెలుస్తుంది. తనని ఆడియెన్స్ ఎలాంటి సినిమా చేస్తే రిసీవ్ చేసుకుంటారో బాగా అర్ధమైనట్టు తెలుస్తుంది. ఏమాయ చేసావె సినిమా నుండి మజిలీ వరకు నాగ చైతన్య లవ్ స్టోరీస్ చేస్తేనే ప్రేక్షకుల మెప్పు పొందాడు. మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నాలన్ని నిరాశ పరచాయి.


అందుకే నాగ చైతన్య ఇక మీదట ఇలాంటి సెన్సిటివ్ స్టోరీలే చేస్తే బెటర్ అని అంటున్నారు. ఓ పక్క ఇంత ఏజ్ వచ్చినా సరే నాగార్జున మన్మధుడిగా రెచ్చిపోతున్నాడు. ఓ పక్క అఖిల్ తన హిట్టు సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. చైతు ట్రాక్ లో పడినట్టు అనిపిస్తుండగా వెంకీమామ కూడా హిట్టైతే ఇక మనవాడికి తిరుగు లేదని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: