సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమాగా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చాలారోజుల తరువాత మహేష్ బాబు సినిమాల్లో పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ రూపొందబోతున్న ఈ సినిమాను మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు ముగ్గురు కలిసి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాతో మరొక్కసారి మహేష్ తో కలిసి పనిచేస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. 

మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి సీనియర్ నటి మరియు లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి ఒక మెయిన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. అలానే శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్ వంటి కమెడియన్స్ కూడా నటిస్తున్నారు. ఇకపోతే అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా గురించి నేడు ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే, ఈ సినిమా నుండి హీరోయిన్ రష్మిక తప్పించారట సినిమా యూనిట్. నిజానికి మొదటినుండి తమ హీరో మహేష్ బాబు సరసన రష్మిక వద్దని, మహేష్ ముందు ఆమె మరీ తేలిపోయినట్లు ఉంటుందని మహేష్ ఫ్యాన్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆ మధ్య ఈ సినిమాలో మరొక్కసారి భరత్ అనే నేను భామ కియారా అద్వానీని తీసుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చాయి, 

ఇక సినిమా ప్రారంబోత్సవం నాడు అవన్నీ ఒట్టి పుకార్లని తేలిపోయాయి. అయితే కేవలం మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాక కొందరు చిత్ర యూనిట్ కూడా మహేష్ కు రష్మిక సరిపోకపోవచ్చునని అభ్యంతరం వ్యక్తం చేసారని, దానితో కొంత ఆలోచనలో పడ్డ దర్శక నిర్మాతలు ఆమె స్థానంలో మరొక హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. నిజానికి ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్త పై సరిలేరు నీకెవ్వరు టీమ్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరి ఇందులో వాస్తవం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: