ప్రస్తుతం సినిమాలు వదిలేసి రాజకీయాలపై దృష్టిపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇక రాబోయే రోజుల్లో అయన సినిమాలు చేయరని, అలానే తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవకే అంకింతం చేయాలని నిర్ణయించినట్లు అయన సోదరుడు నాగబాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ చెప్పారు. అయితే పవన్ ఫ్యాన్స్ కోరిక ఏంటంటే, అయన చివరిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన అజ్ఞాతవాసి సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలవడంతో, పవన్ తమ కోసం చివరిగా ఒక మంచి హిట్ సినిమాలో నటిస్తే బాగుంటుందని అంటున్నారు. 

నిజానికి పవన్ అజ్ఞాతవాసి తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి ఉంది, అయితే అప్పటికే అయన పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవడంతో ఆ ప్రాజక్ట్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో పవన్ ఒక సినిమాలో నటించనున్నట్లు చెప్తున్నారు. అయితే నాగబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ పూర్తి స్థాయిలో సినిమాలు నటించరు అని చెప్పినప్పటికీ, 

అవకాశం ఉంటె అతిథి పాత్రలో మాత్రం నటించే అవకాశం ఉన్నట్లు అయన చిన్న హింట్ ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ విషయమై పుకరవుతున్న వార్త ఏంటంటే, ఆర్ఆర్ఆర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చేయబోయే సినిమాలో ఒక చిన్న అతిథి పాత్ర ఉందని, సినిమాలో అది ఎంతో కీలకమైందని, అయితే ఆ పాత్రకు పవన్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుకాని ఒకవేళ నిజం అయితే మాత్రం మెగా అభిమానులకు ఇది పండుగ వార్తే ఎన్ని చెప్పవచ్చు....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: