ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ సాహో. బాహుబలి సినిమాల విజయాల తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలోని యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తాయి అంటోంది చిత్ర యూనిట్. 

ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని చూస్తే అది మనకు కొంత వరకు అర్ధం అవుతుంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపొతే దర్శక నిర్మాతలు సినిమాను మూడు భాషల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేసేలా ఇప్పటినుండి అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అంతేకాక త్వరలో పాటలను యూట్యూబ్ ద్వారా విడుదల చేయనున్న చిత్ర యూనిట్, తరువాత తమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అదరహో అనిపించేలా ప్లాన్ చేసిందట. ఇక నేడు ఈ విషయమై పలు మీడియా మాధ్యమాల్లో ఒక వార్త విపరీతంగా ప్రచారం అవుతుంది. 

అదేమిటంటే, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు భారీ స్థాయిలో ఖర్చు పెట్టడమే కాక, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్, బాలీవుడ్ నుండి కొందరు నటులను ప్రత్యేక అతిథులుగా పిలవనున్నారట. నిజానికి బాహుబలి రెండు భాగాల సక్సెస్ తరువాత ప్రభాస్ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో పాపులర్ అవడంతో ఈ విధంగా అన్ని భాషల నుండి నటులను అతిథులుగా ఆహ్వానించాలని భావిస్తోందట చిత్ర యూనిట్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలంటే మాత్రం, సాహో యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సిందే. యువి క్రియేషన్స్  బ్యానర్ పై ప్రభాస్ స్నేహితులు వంశీ, ప్రమోద్ ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్మిస్తున్న ఈ సినిమా స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: