అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి లేడీ సూపర్ స్టార్ గా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి అందరి టాప్ హీరోలతోనూ నటించిన విజయశాంతి రాజకీయాల బాట పట్టి సుమారు 15 సంవత్సరాలు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విజయశాంతి తిరిగి యూటర్న్ తీసుకుని మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ లో నటిస్తోంది. రేపు విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఆమె ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఈరోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసింది.

చాలాకాలం ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తాను తిరిగి సినిమాలలో నటిస్తానని అనుకొలేదని అంటూ మహేష్ చిన్నతనంలో తల్లిగా నటించిన తాను తిరిగి అదే మహేష్ కు అత్తగా నటించడం తనకు ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈసినిమాలో తన లుక్ కోసం రోజుకు రెండు గంటలు వ్యాయామం చేస్తూ మరో గంట యోగ చేస్తూ ఇప్పటి వరకు తాను ఆరు కేజీల బరువు తగ్గానని అయితే ఇంకా మరో నాలుగు కేజీల బరువు తగ్గడం తన ధ్యేయం అని అంటోంది.

మహేష్ చిన్నతనంలో తాను నటించిన కొడుకు ‘దిద్దినకాపురం’ షూటింగ్ లో తాను మహేష్ ను కొట్టే సీన్ ఒకటి ఉందనీ అయితే అప్పట్లో అమాయకంగా ఉన్న మహేష్ ముఖం చూసి తాను కొట్టలేకపోయానని అయితే ఆసినిమాకు దర్శకత్వం వహిస్తున్న సూపర్ స్టార్ కృష్ణ తనను ఎంత ఒత్తిడి పెట్టినా మహేష్ ను బెత్తంతో కొట్టే సీన్ లో తాను నటింలేక ఆరు టేకులు తీసుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంది. దీనితో విసిగిపోయిన మహేష్ తన తండ్రి కృష్ణ వైపు చూస్తూ ‘ఆంటీ నన్ను కొట్టలేదు కాని నువ్వు వచ్చి కొట్టు నాన్న’ అని అనడంతో తనకు పౌరుషం వచ్చి మహేష్ ను కొట్టిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. 

అయితే అప్పుడు కూడ తాను నెమ్మదిగా కొట్టడానికి ప్రయత్నించినా ఆ ఫోర్స్ లో మహేష్ కు గట్టిగా దెబ్బ తగలడంతో మహేష్ బుగ్గలు ఆనొప్పితో కందిపోయిన విషయం తనకు గుర్తుంది అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంది. ఇప్పుడు మహేష్ సూపర్ స్టార్ గా ఎదిగిపోయినా తన దృష్టిలో చిన్నపిల్లవాడులానే కనిపిస్తాడని అంటూ మహేష్ తో నటించే సీన్స్ కోసం తాను ఎదురు చూస్తున్నాను అంటూ విజయశాంతి కామెంట్స్ చేసింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: