సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు అద్భుతమైన టెక్నీషియన్ అన్న మాట ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలందరితోను పని చేశారు. ఇక దాదాపు స్టార్ హీరోయిన్స్ అందరు ఛోటా కెమెరాలో చిక్కిన వాళ్ళే. అయితే ఇండస్ట్రీలో ఛోటాకి ఎంత మంచి పేరుందో హీరోయిన్స్ విషయంలో అంత నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. అందుకు కారణం మనోడు హీరోయిన్స్ తో చనువు అన్న పదానికి కాస్త ఎక్కువగా బిహేవ్ చేయడమే. 


ఇంతకముందు ఒకసారి ఛోటా గారికి టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఎందుకనో బాగా ముద్దొచ్చింది.. పబ్లిక్ గా స్టేజ్ పైనే క్షణం ఆగకుండా, అందరు ఉన్నారు అని ఆలోచించకుండా 'ఉమ్మా' ఒక ముద్దిచ్చేశాడు.  పాపం..క్షణంలో జరిగింది ఏంటో అర్థం కాక.. అర్థమైయాక చేసేదేమిలేక సర్లే అని చిన్న కౌంటర్ ఇచ్చి కాజల్ సరిపెట్టుకుంది.  అయితే కాజల్ ఊరుకున్నా, లోకం ఊరుకోదుగా?  కాకుల హంగామా జరిగింది. అది గతం. కానీ అలాంటి మరో ఇన్సిడెంట్ రీసెంట్‌గా జరిగింది.  
 
ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రాజుగారి గది 3' సినిమా లాంచ్ జరిగింది.  ఈ సినిమాలో తమన్నా ప్రధానపాత్రలో నటిస్తోంది.  ఈ సినిమా లాంచ్ కార్యక్రమం జరిగే సమయంలో తమన్నా పక్కనే ఛోటా నిలబడ్డారు.  తమన్నా చేతిని తనచేతిలోకి తీసుకొని ప్రేమతో గట్టిగా పట్టుకున్నారు.  కానీ చూసిన వాళ్ళకి మాత్రం ఏదో పనికోసం చేతిని 'నొక్కినట్టుగా' కనిపించింది.  ఎంతైనా పాడు లోకం కదా.. జనాల పాడు కళ్ళకు ఛోటా గారు చేసే పాడుపనులు భలే కనపడతాయి. భాగా కనిపెడతాయి. మంచి పనులు కనపడం లేదు మరి.  దీంతో ఛోటా గారు మళ్ళీ గీత దాటారంటూ గగ్గోలు మొదలయింది. అయినా గీత దాటారని చెప్పాల్సింది మిల్కీ బ్యూటీ కదా?


తను మాత్రం ఏం జరగనట్టుగా సైలెంట్‌గా కనిపించింది. సహజంగా డైరెక్టర్లతో.. హీరోలతో.. సినిమాటోగ్రాఫర్లతో హీరోయిన్లు గొడవ పెట్టుకోలేరని అందుకే తమన్నా కూడా ఏం జరగనట్టు కామ్ గా ఉందని కొందరు అంటున్నారు. సభ్యసమాజం ఒప్పుకోని 'అసభ్య' సంఘటనపై అటు ఛోటా కానీ ఇటు మిల్కీ బ్యూటీ కానీ ఇంకా స్పందించలేదు. ఆ..ఇదంతా మాకు మామూలే అనుకున్నారేమో మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: