ఇటీవల కాలంలో అంద‌రిలో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘దొరసాని’. ఈ చిత్రం జూలై 12న ప్రేక్షకులవిడుద‌లవుతుంది. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ జంట‌గా న‌టిస్తున్నారు. మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు.

 

ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని గ్రాండ్ రిలీజ్‌కి సిద్దం అవుతుంది. ఈ చిత్రంతో దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నారు. 80వ దశకంలో తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఒక స్వచ్ఛమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది చిత్ర యూనిట్.

 

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ‘నింగిలోన పాలపుంత నవ్వులొంపెనే’ పాట `దొరసాని`పై అంచనాలను పెంచాయి. మరోపాట ‘కలవరమై.. కలవరమై’ఈనెల 24న రిలీజ్ అవుతుంది. కల్మషం లేని ప్రేమకథగా తెరకెక్కిన ‘దొరసాని ’ప్రేమకథలలో ప్రత్యేకస్థానంలో నిలుస్తుందంటున్నారు దర్శక నిర్మాతలు.

 

దీనిని జీవిత మరియు రాజశేఖర్ లు చాల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ఎందుకంటే వాళ్ళ గారాల పట్టి మొదటి చిత్రం కనుక.  ఫస్ట్ లుక్ అండ్ టీజర్ కు మంచిమార్కులే పడ్డాయి.  అన్నట్టు హీరోకి కూడా ఇది మొదటి చిత్రమే. మన రౌడీ తమ్ముడు నటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: