ప్రిన్స్ మహేష్ బాబు సరసన ‘టక్కరి దొంగ’ సినిమాలో నటించిన బాలీవుడ్ నటి లీసారే చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా ఆమె తన కవల కుమార్తెల జన్మదిన వేడుకలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఆమె తన ముద్దులొలికే పిల్లల ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఈ ఫొటోలను షేర్ చేసిన లీసా..

 

 ‘ఈ రోజు మా మొదటి పుట్టిన రోజు. అత్త ప్రీతా సుఖ్తంకర్, మామ ఎస్కేల మధ్య రోజు ఆనందంగా ప్రారంభమైంది. వారు మమ్మల్ని మహారాష్ట్ర రాణులుగా తయారుచేశారు. మాకు మా స్నేహితుల నుంచి ఎన్నో బహుమతులు అందాయి. మా అమ్మ షేరింగ్, కేరింగ్‌ల గురించి మాట్లాడుతూ అవి ఒక్కటే అని చెబుతుంది.

 

అందుకే నేను నా సోదరి నుంచి నా బహుమతులను తిరిగి తీసేసుకున్నాను’ అనే క్యాప్షన్ రాశారు. కాగా లీసా రే గత ఏడాది సరోగసీ విధానంలో తల్లిగా మారారు. ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ప్రొఫెషనల్ వర్క్, సెల్ప్ కేర్, ట్రావెల్, సోషల్ లైఫ్, ఫ్యామిలీ మొదలైనవన్నీ నా జీవితంలో అడ్వెంచర్‌గా మారాయి. ఇప్పుడు నేను నా పిల్లలలో ఎంతో ఆనందంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: