విజయశాంతి వ్యక్తిగత జీవితం గురించి ఆమె ఎప్పుడు మాట్లాడలేదు. సినిమాలలో రాజకీయాలలో ఒక వెలుగు వెలిగే సందర్భంలో కూడ ఆమె తన భర్తతో ఎప్పుడు బయట కనిపించలేదు. అయితే ఇప్పుడు సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్న పరిస్థుతులలో ఆమె నోటివెంట ఆమె భర్త ప్రస్తావన రావడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. తన భర్త శ్రీనివాస్ ప్రసాద్ గురించి అదేవిధంగా తాను ఎందుకు పిల్లలను కనలేదు అన్నవిషయాలను గురించి ఇప్పుడు ఆమె స్పందించింది. 

తనకు 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తన తండ్రి చనిపోయాడని ఆతరువాత కేవలం ఒక సంవత్సరానికే తన తల్లి చనిపోయిందని అప్పటి విషయాలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంది. అలాంటి పరిస్థుతులలో ఆరోజులలో తనకు తోడుగా నిర్మాత శ్రీనివాస ప్రసాద్ నిలబడ్డాడని దీనితో తమ మధ్య అప్పట్లో ప్రేమ చిగురించి రహస్యంగా తాను హీరోయిన్ గా పీక్ పిరియడ్ లో ఉన్నప్పుడే పెళ్ళి చేసుకున్న విషయాన్ని బయట పెట్టింది. 

అంతేకాదు తాను హీరోయిన్ గా క్షణం తీరిక లేకుండా 15 సంవత్సరాలు కొనసాగడం ఆతరువాత 10 సంవత్సరాలు పార్లమెంట్ నెంబర్ గా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్న నేపధ్యంలో ఆ బిజీలో తాను పిల్లల గురించి ఆలోచించలేదనీ ఇప్పుడు ఆలోచించినా ప్రయోజనం లేదు అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడింది. అంతేకాదు హీరోయిన్లకు వైవాహిక జీవితాలు చాలా వరకు శాపాలుగా మారుతుంటాయని కానీ తనకు మాత్రం చాలా మంచి భర్త దొరికాడని చెపుతూ 1988 మార్చి 29న తాము రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నామని పెళ్లయ్యి 32 ఏళ్లయిందని ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని బతుకుతున్నామని విజయశాంతి తన భర్త నేపధ్యం గురించి వివరించింది. 

ఒక సందర్భంలో ఢిల్లీలో ప్రోగ్రాంకి వెళ్తే తన భర్త ఫొటో తీసి ఒక ఆంగ్లపత్రికలో ప్రచురించారని హీరోయిన్లు ఇంత అందమైన భర్తలను ప్రజలకు తెలియకుండా ఎందుకు దాస్తారో అంటూ ఆపత్రిక కామెంట్ వ్రాసిన విషయాన్ని కూడ గుర్తుకు చేసుకుంది. తన సినిమాల రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ప్రేక్షకులు తనను ఆదరిస్తే కనీసం మరో 10 సంవత్సరాలు నటించాలి అని కోరిక ఉంది అంటూ ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ఆలోచనలను బయట పెట్టింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: