కియారా అద్వానీ కుర్ర గుందెల గిలిగింత. యువకుల చక్కిలిగింత. ఆమె అందం చూస్తూ అలా ఉండిపోవచ్చు అంటోంది యూత్. భరత్ అను నేను మూవీలో మహేష్ కి జోడీ కట్టింది. ఆ సినిమాలో ఓ ముఖ్యమంత్రి లవ్ లో పడేటంత అందం కావాలంటే కియారా అద్వానీని తీసుకువచ్చారు. ఇక వినయవిధెయ రామా మూవీ ఫెయిల్ అయినా కూడా కియారా జోరు ఎక్కడా తగ్గలేదు.


ఆమె ఇపుడు బాలీవుడ్లో మూవీస్ చేస్తూనే హాట్ పిక్స్ సోషల్ మీడియాలో పెడుతూ రెచ్చగొట్టుడు పనులు చేస్తూనే ఉంది. వీటికి తోడు అన్నట్లుగా ఇపుడు మరో సెన్సేషనల్ న్యూస్ కియారా బయటపెట్టింది. తాను ఎపుడో  ల‌వ్ లో పడ్డానంటోంది ఈ అమ్మడు. అపుడు తాను పదవతరగతి చదువుతున్నానని, ఫస్ట్ క్రష్ అలా స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చింది.


తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డానని కియారా  వెల్లడించింది. అయితే ఒకరోజు అతనితో ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటే కియారా అమ్మగారు కనిపెట్టేసి ఇలాంటి పనులన్నీ కట్టిపెట్టమని.. చదువుపై ఫోకస్ చెయ్యమని సున్నితంగా హెచ్చరించిందట! ఆ వార్నింగ్ పాటు ఇకపై అబ్బాయిలతో మాట్లాడకూడదని అల్టిమేటం జారీ చేసిందట. 


ఇక  ఆ అబ్బాయిది విభిన్న మనస్తత్వం కావడంతో విడిపోయామని చెప్పింది మొత్తానికి సినిమా ప్రేమలు కాదు, రియల్ లైఫ్ లో ప్రేమలు బాగానే ఉన్నాయని కియారా గుట్టు బయటపెట్టింది. ఇకపోతే కియారా ఇపుడు మాత్రం తనకు ఎవరితోనూ లవ్ లేదని క్లారిటీ ఇచ్చింది. తాను సింగిల్ అని కూడా అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: