గత పర్యాయం నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ నాయకత్వంలోని ప్యానెల్ తిరుగులేని విజయం సాధించింది. అప్పుడు ఇండస్ట్రీలో మెజారిటీ జనాలు విశాల్ వర్గం వైపే నిలిచారు. శరత్ కుమార్ లాంటి దిగ్గజాన్ని ఢీకొట్టి ఎన్నికల్లో ఘనవిజయం సాధించాడు విశాల్.

 

కానీ ఈసారి పరిస్థితి విశాల్ వర్గానికి ఏమంత అనుకూలంగా కనిపించడం లేదు. ఆదివారం నాటకీయ పరిణామాల మధ్య నడిగర్ సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా.. ఈసారి విశాల్ టీంకు గెలుపు కష్టమే అంటున్నారు.

 

ఎన్నికల హంగామా మొదలైనప్పటి నుంచి ఇండస్ట్రీలో అనేకమంది విశాల్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఆల్రెడీ విశాల్ టీంలోని కొందరు అతడికి వ్యతిరేకంగా మారారు. తెలుగువాడైన విశాల్ నడిగర్ సంఘంలో, నిర్మాతల మండలిలో సాగించిన ఆధిపత్యం నచ్చక తమిళ ఇండస్ట్రీ పెద్దలు అసూయ చెందారు.

 

గత పర్యాయం ఎన్నికల సందర్భంగా విశాల్ టీంకు మద్దతుగా నిలిచిన సూపర్ స్టార్ రజనీకాంత్.. అసలీసారి చెన్నైలోనే లేరు. తన సినిమా ‘దర్బార్’ షూటింగ్‌ కోసం ఆయన ముంబయిలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా ఆయన ఓటు వేసే అవకాశం లేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: