టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలయ్యి బాక్సాఫీస్ తేలిన కొత్త ట్రెండ్ సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా ను బాలీవుడ్ ఇండస్ట్రీలో కబీర్ సింగ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రలో షాహిద్ కపూర్ నటించాడు. సేమ్ తెలుగులో డైరెక్టర్ సందీప్ వంగ తెరకెక్కించడం హిందీలో కూడా ఆయన డైరెక్ట్ చేశారు. తాజాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి ఉంటుంది.


సినిమాకి వస్తున్న కలెక్షన్లు చూసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు చెందిన వారు ఆశ్చర్యపోతున్నారు. సినిమాలో షాహిద్ కపూర్ పక్కన కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇటీవల వీకెండ్ అనగా శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ఎవరు ఊహించని విధంగా 20.21కోట్లను వసూలు చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక శనివారం అయితే 22.71కోట్లతో నిర్మాతల ధైర్యాన్ని పెంచింది.


మొత్తంగా సినిమా రెండు రోజుల కలెక్షన్స్ 42.92కోట్లు.  ఇదే జోరు కొనసాగితే షాహిద్ కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని చెప్పవచ్చు. చూస్తుంటే 100కోట్ల క్లబ్ లో చేరడానికి కబీర్ సింగ్ కి పెద్దగా టైమ్ పట్టేలా లేదు. మొత్తానికి దర్శకుడు సందీప్ బాలీవుడ్ లో కూడా సత్తా చాటాడు. ఈ బాక్స్ ఆఫీస్ హిట్ తో మనోడు నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: