విజయశాంతి.. సావిత్ర, వాణీశ్రీ వంటి లెజెండ్స్ తర్వాత తరంలో అత్యధిక కాలం తెలుగు తెరపై హీరోయిన్ గా వెలిగిన తార. కొన్ని దశాబ్దాల పాటు ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా కేరీర్ కొనసాగించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున వంటి అందరు నటులతో ఆమె హీరోయిన్ గా నటించారు.

సుదీర్ఘ కాలం సినిమాలు చేసిన విజయశాంతి.. ఆ తర్వాత రాజకీయ రంగంలోనూ అడుగు పెట్టారు. మొదట తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లు బీజేపీలో ఉన్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. 

సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే 1988లో శ్రీనివాస ప్రసాద్ అనే నిర్మాతను పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్నా.. విజయశాంతి మాత్రం పిల్లలను కనలేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయానికి ఆమె సమాధానం చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొనడం, పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ కావడం వల్లే పిల్లలను కనలేదని చెప్పింది. 

ఒకవేళ పిల్లలను కంటే.. ప్రజల కోసం పని చేసేందుకు తగిన సమయం దొరకదన్న కారణంతోనే సంతానం వైపు మొగ్గుచూపలేదని.. విజయశాంతి చెప్పారు. పిల్లలను కనకపోయినా ప్రజలే తన పిల్లలని ఆమె అంటున్నారు. పిల్లలను కంటే స్వార్థం  పెరుగుతుందని ప్రజాసేవకు అవకాశం దొరకదని ఆమె అభిప్రాయపడ్డారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: