తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. సౌత్ లో సినిమా అవకాశాలు తగ్గిన తరువాత బాలీవుడ్ మీద ఫోకస్ చేసింది. అయితే 'పింక్' చిత్రంలో అమితాబచ్చన్ తో కలిసి నటించిన తాప్సికి ఆ చిత్రం మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. బాలీవుడ్ సినిమాలు చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు సౌత్ సినిమాలను కూడా చేస్తూ ఉన్న తాప్సికి 'పింక్' చిత్రం తమిళ రీమేక్ ఆఫర్ వచ్చిందట.


హిందీలో ఏ పాత్ర అయితే పోషించిందో అదే పాత్రను తమిళంలో కూడా చేయాల్సిందిగా నిర్మాత బోణీ కపూర్ ఆమెను కోరడం జరిగిందట. అందుకు తాప్సి సున్నితంగా నో చెప్పిందట. ఈ విషయాన్ని స్వయంగా తాప్సి చెప్పుకొచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తాప్సి మాట్లాడుతూ.. పింక్ చిత్రం చేస్తున్న సమయంలో చాలా భావోద్వేగానికి గురై ఒకానొక దశలో ఏకంగా డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను.


సినిమాలో ఎక్కువగా లైంగిక వేదింపులకు సంబంధించిన సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ చేస్తున్న సమయంలో నేను చాలా బాధ పడ్డాను. ఆ బాధ మరోసారి పడలేకనే 'పింక్' చిత్రం రీమేక్ లో తాను నటించలేను అంటూ చెప్పినట్లుగా తాప్సి చెప్పుకొచ్చింది. అజిత్ గారితో నటించడం నాకు ఇష్టమే కాని.. ఈ చిత్రం కోసం ఆయనతో నటించలేను అని చెప్పాను. మరోసారి అజిత్తో నటించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా నటిస్తానంది.

మరింత సమాచారం తెలుసుకోండి: