టాలీవుడ్లో ప్రస్తుతం మంచి అంచనాలు సినిమాలేవి థియేటర్లలోకి రావడం లేదు. వరల్డ్కప్ మంచి ఆసక్తిగా ఉండడంతో పాటు టీం ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుండడంతో పెద్ద సినిమాలు రిలీజ్ చేసేందుకు ఎవ్వరూ సాహసించడం లేదు. ఇక వరల్డ్కప్ సమరం ముగిసిన వెంటనే వరుస పెట్టి తమ సినిమాలు థియేటర్లలోకి దింపేందుకు రెడీ అవుతున్నారు.
ఈ క్రమంలోనే వరుస ప్లాపుల్లో ఉన్న ఇద్దరు యంగ్ హీరోల మధ్య ఒకే రోజు బాక్సాఫీస్ వేదికగా పెద్ద యుద్ధం జరగబోతోంది. యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ “ఇస్మార్ట్ శంకర్” యాక్షన్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ “రాక్షసుడు” మూవీల మధ్య క్లాష్ తప్పేలా లేదు. ఈ ఇద్దరు హీరోల సినిమాలు జూలై 18నే విడుదల కానున్నాయి. ఈ మేరకు ఈ రెండు సినిమాల యూనిట్లు అధికారికంగా కూడా ప్రకటన ఇచ్చేశాయి.
పూరి జగన్నాథ్ కూడా వరుస ప్లాపుల్లోనే ఉన్నారు. ఆయన దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ పక్కా మాస్ మూవీ. వరల్డ్కప్ నేపథ్యంలోనే ఈ సినిమాను జూలై 18కు వాయిదా వేశారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా వరుస ప్లాపుల్లోనే ఉన్నారు. ఆయన తాజా సినిమా రాక్షసుడును దర్శకుడు రమేష్ వర్మ క్రైమ్ థ్రిల్లర్ గా నిర్మిస్తున్నారు.
రెండు సినిమాలు భిన్నమైన నేపధ్యం కలిగినా ఒకే రోజు రిలీజ్ అవుతుండడంతో పాటు ఇద్దరికి హిట్ తప్పని సరి కావడంతో ఏ సినిమా పై చేయి సాధిస్తుంది ? అన్న ఆసక్తి సహజంగానే అందరికి ఉంది.