చాలా కష్టపడి డాక్టర్ రాజశేఖర్ గతంలో గరుడవేగ చిత్రం నిర్మించిన విషయం తెలిసిందే. టీజర్, ట్రైలర్ చూసిన ప్రేక్షకులు చిత్రం విడుదలైన తర్వాత విజయపదం వైపు నడింపించారు. దీనికి కారణం గరుడవేగ సినిమాలో ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉండటమే. ప్రస్తుతం యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ హీరోగా.. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న చిత్రం 'కల్కి'.  ఇప్పటికే ఇంట్రెస్టింగ్ ప్రోమోలతో పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమాను జూన్ 28 న రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ సమయం తక్కువ ఉండడంతో 'కల్కి' టీమ్ తమ ప్రమోషన్స్ లో జోరు పెంచారు.

తాజాగా ఈ సినిమానుండి 'ఎవరో ఎవరో' అంటూ సాగే లిరికల్ సింగిల్ ను విడుదల చేశారు. ఈ సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు.  ఈ పాటకు సాహిత్యం అందించిన వారు కృష్ణకాంత్(KK).  సాఫ్ట్ మెలోడీగా సాగే ఈ పాటను ఆలపించినవారు హేమచంద్ర.. శ్వేతా మోహన్.  "ఎవరో ఎవరో ఎవరో అతగాడెవరో ఎపుడో ఎక్కడో తెలిసే గురుతతనెవరో వెతికేలోపే వెనకే నిలిచిందెవరో ఎదురై కలిసి నడకే కలిపిందెవరో" అంటూ ఎంతో ఆహ్లాదంగా ఉండే పదాలతో మనసుకు హాయిగొలిపేలా సాగింది సాహిత్యం. 

ఈ లిరిక్స్ కు  తగ్గట్టే ఎంతో మెలోడియస్ ట్యూన్ ని శ్రవణ్ అందించారు. దానికి మించి అన్నట్టుగా శ్వేత.. హేమ చంద్ర ఈ పాటను సాఫ్ట్ గా పాడారు.  మెలోడీ పాటలు ఇష్టపడేవారికి తెగ నచ్చేలా ఉంది.  "ఆరారా నాకు ముక్కా నాకు ముక్కా నాకు ముక్క" బ్యాచ్ కు మాత్రం మింగుడు పడడం మాత్రం కష్టమే.. ఎందుకంటే పాట స్లోగా ఉంది!. ఈ సినిమాలో రాజశేఖర్ కు జోడీగా అదా శర్మ నటిస్తోంది. నందితా శ్వేత.. పూజిత పొన్నాడ.. రాహుల్ రామకృష్ణ.. నాజర్.. అశోతోష్ రాణా.. శత్రు ఇతర కీలకపాత్రల్లో నటించారు.  ఈ సినిమాను సీ. కళ్యాణ్.. శివాని.. శివాత్మిక నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: