బాహుబలి’ తో నేషనల్ మీడియాలో రాజమౌళి పేరు హోరెత్తి పోయింది. ఇలాంటి పరిస్థుతులలో మరో తెలుగు దర్శకుడు తీసిన ఒక సినిమా ఇప్పుడు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించి బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ గా మారిపోయాడు అతడే సందీప్ వంగా.

‘అర్జున్ రెడ్డి’ రీమేక్ గా వచ్చిన ‘కబీర్ సింగ్’ కు విమర్శకుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా ఈమూవీ విడుదల అయిన కేవలం మూడు రోజులలో 60 కోట్లు వసూలు చేయడం బాలీవుడ్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈమూవీకి బాలీవుడ్ లో కొనసాగుతున్న మ్యానియాను పరిశీలిస్తే కేవలం మరొక రెండు రోజులలో ఈమూవీ 100 కోట్ల సినిమాగా మారుతుంది అని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. 

దీనితో ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఎక్కడ చూసినా దర్శకుడు సందీప్ వంగా గురించి వార్తలు కనిపిస్తున్నాయి. ‘బాహుబలి’ తరువాత ఒక తెలుగు దర్శకుడు గురించి ఇలా జాతీయ స్థాయిలో మాట్లాడుకోవడం సందీప్ వంగ విషయంలో మాత్రమే జరుగుతోంది. 

‘కబీర్ సింగ్’ మూవీకి విమర్శకులు అత్యంత తక్కువ రేటింగ్స్ ఇచ్చినా ఈమూవీకి వస్తున్న కలక్షన్స్ ను బట్టి ఈమూవీ పై కొనసాగుతున్న మ్యానియా ఏస్థాయిలో ఉందో తెలుస్తోంది. అంతేకాదు రాజమౌళి సంవత్సరాలు తరబడి కష్టపడి వందల కోట్ల పెట్టుబడితో భారీ గ్రాఫిక్స్ తో తీసిన ‘బాహుబలి’ సృష్టించిన మ్యానియా స్థాయిలో ఈరోజు సందీప్ వంగా ‘కబీర్ సింగ్’ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీ మాట్లాడుకుంటూ ఉండటంతో ఒక చిన్న సినిమాతో ఏకంగా సందీప్ వంగా భారీ సినిమాల రాజమౌళికి బాలీవుడ్ మార్కెట్ లో సమానంగా గుర్తింపు పొందడంతో ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ విషయమై రాజమౌళి మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా ‘కబీర్ సింగ్’ ఘన విజయం పరోక్షంగా ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది అంటూ బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాయడం ఒక విధంగా రాజమౌళికి ఊహించని షాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: