టాలీవుడ్ టాప్ హీరోలు బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ సక్సస్స్ అవ్వాలి అన్న ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నా ఆ ప్రయత్నాలలో మెజారిటీ హీరోలు ఫెయిల్ అయ్యారు. అయితే ‘బాహుబలి’ తో ప్రభాస్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ఏర్పడినా ఆ క్రేజ్ కేవలం ‘బాహుబలి’ ఇచ్చిన సక్సస్ తో వచ్చిందా ? లేదంటే ప్రభాస్ ను హీరోగా బాలీవుడ్ గుర్తించిందా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 

దీనితో ప్రభాస్ కెరియర్ కు ప్రామాణికంగా ‘సాహో’ సక్సస్ ను బట్టి నిర్ణయింబోతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ కు ‘సాహో’ ఘన విజయం అత్యంత కీలకంగా మారిన  విషయం తెలిసిందే. చాల రోజుల నుంచి మహేష్ బాలీవుడ్ ఎంట్రీ పై కూడ చర్చలు జరుగుతున్నాయి.    

వాస్తవానికి బాలీవుడ్ లో నటించాల్సిందిగా పలువురు దర్శక నిర్మాతలు మహేష్ వెంట పడుతూనే ఉన్నారు. కానీ అతడు ప్రతిసారీ టాలీవుడ్ కే ప్రాధాన్యతనిస్తూ బాలీవుడ్ కి వెళ్లనని చెపుతున్న విషయంతెలిసిందే. అయినా ప్రతిసారీ మీడియా మహేష్ ను ఈ ప్రశ్న అడుగుతూనే ఉంది.   ఇలాంటి పరిస్థితులలో లేటెస్ట్ గా మహేష్ బాలీవుడ్ మీడియా సంస్థకు కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు తిరిగి ఎదురైన బాలీవుడ్ ఎంట్రీ పై షాకింగ్ సమాధానం ఇచ్చాడు. ‘ప్రస్తుతానికి నా ప్లేట్ అసలు ఖాళీ లేదు. బాలీవుడ్ ఎంట్రీ గురించి ఇప్పుడే చెప్పలేను’ అంటూ సమాధానం దాట వేశాడు. 

దీనితో సౌత్ లో కెరీర్ పరంగా బిజీగా ఉన్నానని ఇప్పట్లో బాలీవుడ్ కి వెళ్ళేది లేదని మహేష్ చెప్పాడు అనుకోవాలా ? లేదంటే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి పరోక్షంగా కామెంట్ చేసాడా అంటూ కొందరు మహేష్ కామెంట్స్ విశ్లేషణలు చేతున్నారు. అయితే ‘సాహో’ రిజల్ట్ తరువాత మహేష్ ఆలోచనలలో కూడ మార్పులు వచ్చినా ఆశ్చర్య పడనక్కరలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: