విజయశాంతి లేడీ అమితాబ్, ఓ తరం ప్రేక్షకులను వుర్రూతలూగించిన గ్లామర్ స్టార్. తెర మీద ఆమె కనిపిస్తే చాలు స్టార్ హీరోలు మించిన విజిల్స్ వచ్చేవి. అన్ని రకాలైన పాత్రలను చేస్తూ తనకు తిరుగులేని స్టార్ డమ్  సొంతం చేసుకున్న విజయశాంతి సుదీర్ఘమైన కెరీర్ కొనసాగించారు. రాజకీయాల్లోనూ రాణించి ఒకసారి ఎంపీగా కూడా గెలిచారు.


లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ, తనకు పిల్లలు లేరు అన్నారు. తానే కావాలని పిల్లలను కనడం మాసేశాను అని చెప్పి షాక్ ఇచ్చారు. పిల్లలు ఉంటే స్వార్ధం పెరిగిపోతుందని, అందువల్లనే వద్దు అనుకున్నామని చెప్పుకొచ్చారు. తనకు ప్రజలే పిల్లలు అని వారి కోసేమే తన జీవితం అంకితమని ఆమె చెప్పడం విశేషం.


ఇక తాను చిన్నప్పుడే అమ్మా నాన్నలను పోగొట్టుకున్నానని, తనకు నా అన్న వారు లేక నానా బాధలు పడ్డాయని విజయశాంతి తన కష్టాల చిట్టా బయటపెట్టరు. ఇంటికి వెళ్తే పలకరించే నాధుడులేడని, ఓ విధంగా సినిమాల్లో స్టార్ గా ఉన్న రోజుల్లోనే ఇంట్లో ఒంటరి జీవితం గడిపానని ఆమె అన్నారు. ఆ సమయంలో పరిచయం అయిన శ్రీనివాస ప్రసాద్ ని పెళ్ళి చేసుకున్నానని ఆమె చెప్పారు. తమది అపురూప కాపురం అంటూ ఆమె అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: