ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లు ఎవరంటే గుర్తొచ్చే పేరు పూజా హెగ్డే.  వరుసగా 'దువ్వాడ జగన్నాధం, అరవింద సమేత, మహర్షి' సినిమాల్లో కనిపించిన ఈమె నెక్స్ట్ అల్లు అర్జున్, వరుణ్ తేజ్ సినిమాలో నటిస్తోంది.  స్టార్ హీరోలు, దర్శకులు ఈమె డేట్స్ కోసం ఎదురుచూసే పరిస్థితి.  కానీ పూజా మనసు మాత్రం బాలీవుడ్ మీదుంది.  గతంలో కూడా తెలుగులో నిలదొక్కుకుంటోంది అనుకునే సమయానికి హిందీలో 'మొహంజొదారో' ఛాన్స్ దొరికే సరికి ఇక్కడి ఆఫర్లు వదిలేసి చెంగు చెంగున వెళ్ళిపోయింది. 

ప్రస్తుతం వాల్మీకిగా వరుణ్ తేజ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరక్కుతోంది తమిళ హిట్ మూవీ జిగర్తాండకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ లుక్ కి సంబంధించిన ఫోటోలు ఇటీవల లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్ ఆ మొదట డెబ్యూ నటిని తీసుకోవాలని భావించారు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మనసు మార్చుకుని పూజా హెగ్డే అయితే బావుంటుందని భావిస్తున్నాడట. పూజా హెగ్డేకు కుర్రకారులో ఉన్న క్రేజ్ తో ఆమెకు అడినంత పుచ్చుకునేందుకు నిర్మాతలు సిద్ధం అయ్యారట.

తెలుగు ఆఫర్ కోసం చాలారోజులు ఎదురుచూసి ఎట్టకేలకు ఈమధ్యే పుంజుకుంది.  ఇదే ఫామ్ చూపిస్తే ఆమె నిలదొక్కుకోవడం ఖాయం అనుకునే సమయానికి హిందీలో 'ముంబై సాగ' అనే సినిమాలో ఆఫర్ రాగానే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది.  దీంతో ఆమెకు బాలీవుడ్ మీద మక్కువ తీరలేదని అర్థమైంది.  కొందరైతే తెలుగులో స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు హిందీలోకి వెళ్లి దాన్ని డ్యామేజ్ చేసుకోవడం ఎందుకు, ఒకవేళ గతంలో పరిస్థితే మళ్ళీ వస్తే ఈసారి నిలదొక్కుకోవడం కష్టమని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: