టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, ఆలీ, సునీల్ ఈ మద్య వస్తున్న శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ ల కామెడీ చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటాం..అలాగే ఫిమేల్ కమెడియన్స్ లో ఒకప్పుడు గిరిజ,రమా ప్రభ ల తర్వాత ఆ స్థాయిలో కామెడీ పండించిన వారిలో హేమ ఒకరు.  బ్రహ్మానందం, హేమల కామెడీ చూస్తే థియేటర్లో పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు.  హేమ కేవలం నటిగానే కాకుండా ఇతర విషయాల్లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాన్న విషయం తెలిసిందే.  ముఖ్యంగా మా ఎన్నికల సమయంలో ఆమె పేరు బాగా వినిపిస్తుంది. 

గతంలో పలు మార్లు ‘మా’ ఎన్నికల సందర్భంగా రచ్చ రచ్చ చేసింది.  తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి తాజాగా ఓ ప్రెస్ మీట్ జరిగింది.  ఆ మద్య ‘మా’ ఎన్నికల సమయంలో ఏర్పడ్డ గందరగోళం చూసి చాలా టెన్షన్ పడిపోయానని..కానీ ప్రస్తుతం మా సభ్యుల మద్య ఐకమత్యం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు నటి హేమ. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో కన్నీరు పెట్టుకున్నారు..లేడీ ఆర్టిస్ట్ లకు వేషాలు ఇవ్వాలని దర్శకనిర్మాతలను కోరారు.

మా అసోసియేషన్ లో ఉన్న 800 మందిలో  100, 150 మంది మాత్రమే ఆడవాళ్లు ఉన్నారని వారి కష్టాలను దర్శకనిర్మాతలు గమనించాలని..వారికి వేషాలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని కావాలంటే మీ కాళ్లకు దండం పెడతా ప్లీజ్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'మా' అధ్యక్షుడు నరేష్ ఆధ్వర్యంలో అంతా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని.. ఇలానే మరింత ముందుకు వెళ్తామని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: