మహర్షి సినిమా విజయం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు కుటుంబ సమేతంగా లండన్ ట్రిప్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ ట్రిప్ కంటే ముందుగా మహేష్ తన కొత్త సినిమాకు సంతకం చేశారు. ఇప్పుడు ఫ్యామిలీతో పాటు జాలీగా గడిపేసి మహేష్ బాబు వచ్చేశారు. ఇంకో పది రోజుల్లో సరిలేరు నీకెవ్వరు రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ తో పాటు దిల్ రాజు-అనిల్ సుంకర ముగ్గురు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న. జులై 5 నుంచి కాశ్మీర్ లో షూట్ మొదలుపెట్టబోతున్నారు.

కథ ప్రకారం మహేష్ ఇందులో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటి తాలూకు యాక్షన్ ఎపిసోడ్స్ ని   రియల్ టైం ఎన్విరాన్మెంట్ లో చిత్రీకరించబోతున్నారు. భారీ ఫైట్ తో పాటు ఓ థ్రిల్లింగ్ ఛేజ్ కూడా ఉంటుందని తెలిసింది. అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది. చాలా టెర్రిఫిక్ గా ఉండే ఈ ఎపిసోడ్ కోసం ఏకంగా ఇటలీ నుంచి స్పెషలిస్ట్ ఫైట్ మాస్టర్లను పిలిపించారు. ఇప్పుడు వాళ్ళ పర్యవేక్షణలోనే ప్రిన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు టాక్.

ఇది వారం పాటు సాగుతుందని ఆ తర్వాత టీమ్ మొత్తం కాశ్మీర్ వెళ్లేలా ప్లానింగ్ ఉన్నట్టుగా తెలిసింది. వచ్చే సంక్రాంతికి విడుదల టార్గెట్ చేసుకున్న సరిలేరు నీకెవ్వరుకి చేతిలో కేవలం ఆరు నెలల టైం మాత్రమే ఉంది. డిసెంబర్ మధ్యలోపే ఫస్ట్ కాపీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అనిల్ రావిపూడి ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో చూడాలి. ఎఫ్2 దర్శకుడు మహర్షి హీరో కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాబట్టి అంచనాలు కూడా దానికి తగ్గట్టే భారీగా ఉన్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: