సున్నితమైన ప్రేమ కథా చిత్రాల్ని తెరకెక్కించడంలో దిట్ట శేఖర్ కమ్ముల. ఆయన ప్రతీ సినిమాలో ఆ సున్నితత్వం ఉంటుంది. అందంగా కథ చెప్పే తీరు ఆకట్టుకుంటుంది. "హ్యాపీడేస్ " సినిమాతో కాలేజీ స్టోరీలకి ఒక కొత్తదనం తెచ్చాడు. " లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" అంటూ జీవితంలోని అందాన్ని చూపించాడు. మొన్న వచ్చిన "ఫిదా" తో అందరి మనసులని ఫిదా చేసాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది.

 

అయితే ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తన తర్వాతి సినిమా కొత్త వాళ్ళతో ఉంటుందని వార్త వచ్చింది. అయితే తాజాగా శేఖర్ కమ్ముల తన తర్వాతి చిత్రం అక్కినేని వారసుడు నాగచైతన్య తో ఉంటుందని టాక్ వినిపిస్తోంది.  ఈ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్య కి జోడీగా నటించనుందట. శేఖర్ కమ్ముల కొత్త వాళ్ళతో సినిమా మొదలెట్టి యాభై శాతం పూర్తయ్యాక, దాన్ని పక్కన పెట్టి ఈ సినిమా ప్రకటించేసాడు.

 

అయితే కొత్త వాళ్లతో సినిమా ఆపెయ్యడానికి కారణాలు చాలా ఉన్నాయని, అందులో ఒకటి ఆ సినిమా అవుట్ పుట్ సరిగా రాలేదని, అందుకే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసాడని అనుకుంటున్నారు. శేఖర్ కమ్ముల ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే నాగ చైతన్యతో సినిమా ఎలా ఉంటుందనేది ఇంకా తెలిసి రాలేదు.

 

మజిలీ సినిమా హిట్ తో మంచి జోరు మీద ఉన్నాడు నాగచైతన్య. నాగచైతన్య కి ప్రేమ కథా చిత్రాలే విజయం తెచ్చి పెట్టాయి. మరి ఇప్పుడు ప్రేమ కథలు తీసే దర్శకుడితో సినిమా ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవలేదు. ఈ సినిమా అప్ డేట్స్ తెలియాలంతే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: