‘మహర్షి’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో అదే జోరు కొనసాగించాలని అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మహేష్. ఈ సినిమా లో మహేష్ తో సీనియర్ హీరోయిన్ విజయశాంతి కూడా నటిస్తోంది. జులై 5 నుండి ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే ఇండస్ట్రీ నుండి వార్తలు వినబడుతున్నాయి.


ఇటువంటి క్రమంలో కాశ్మీర్ అంటే ఎక్కువగా భారత్ ఆర్మీ ఉండే ప్రాంతం కాబట్టి కచ్చితంగా ఈ సినిమా లో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారని జరుగుతున్న షూటింగ్ స్పాట్ బట్టి తెలుస్తోంది. ఇదిలావుండగా తాజాగా ఈ సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో ఫైట్లు అదిరిపోయే రేంజ్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు ఎవరూ తీయని విధంగా ఉండేటట్లు...సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్  ని రియల్ టైం ఎన్విరాన్మెంట్ లో చిత్రీకరించబోతున్నారు. భారీ ఫైట్ తో పాటు ఓ థ్రిల్లింగ్ ఛేజ్ కూడా ఉంటుందని తెలిసింది.


అయితే ఇక్కడ ఇంకో విశేషం ఉంది. చాలా టెర్రిఫిక్ గా ఉండే ఈ ఎపిసోడ్ కోసం ఏకంగా ఇటలీ నుంచి స్పెషలిస్ట్ ఫైట్ మాస్టర్లను పిలిపించారు. ఇప్పుడు వాళ్ళ పర్యవేక్షణలోనే ప్రిన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు టాక్. మొత్తం మీద సినిమా కాకముందే సరిలేరు నీకెవ్వరు సినిమా గురించి వస్తున్న వార్తలు మహేష్ అభిమానుల లో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: