తెలుగు చిత్రం `అర్జున్ రెడ్డి`కి బాలీవుడ్ రీమేక్ `క‌బీర్‌సింగ్‌`. షాహిద్ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. టీవీ యాక్ట‌ర్ న‌కుల్ మెహ‌తా `క‌బీర్‌సింగ్‌`లో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌ని తాము చూసుకుంటున్నారు అని ట్వీట్ చేశారు.

 

అదే సమయంలో జాతీయ మ‌హిళా క‌మీష‌న్ చైర్ ప‌ర్స‌న్‌, రేఖా శ‌ర్మ కూడా షాహిద్ న‌ట‌న‌ను ప్ర‌శంసించారు. అయితే అయితే దీనిపై గాయ‌ని సోనా మ‌హాపాత్ర తీవ్ర అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు.

 

'మ‌హిళ‌ల వ్య‌క్తిత్వాన్ని కించ‌ప‌రిచేలా, పితృస్వామ్య వ్య‌వ‌స్థ‌ను ప్రోత్స‌హించేలా ఉన్న అంశాల‌ను సినిమాలో మీరు గ‌మ‌నించలేదా?. మీరొక మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్‌గా ఉండి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం షాకింగ్‌గా ఉన్నాయి. మ‌న‌దేశంలో మ‌హిళ‌ల‌కు ఉన్న ప్రాధాన్య‌త గురించి ఆలోచించుకోవాల్సి వ‌స్తుంది.'

 

'ఇలాంటి సినిమాల ద్వారా మీరేం చెప్ప‌ద‌లుచుకున్నారు?' అని సోష‌ల్ మీడియా ద్వారా `క‌బీర్ సింగ్‌`పై సోనా మ‌హాపాత్ర త‌న అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేశారు. కబీర్ సింగ్ మన తెలుగు అర్జున్ రెడ్డి కి రీమేక్ అని  మనందరికీ తెలిసినదే. తెలుగు నాట ప్రభంజనం సృష్టించిన అర్జున్ రెడ్డి, బాలీవుడ్ లో కూడా అంతే రేంజ్ లో దూసుకు పోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: