ప్రస్తుతం ఇటు బుల్లితెరపైనే కాకుండా అటు మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి పేరు సంపాదిస్తున్న యాంకర్లలో అనసూయ ఒకరు అనే చెప్పాలి. ఒకప్పుడు చిన్న చిన్న కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన అనసూయ, ఆ తరువాత ఈటివి ఛానల్ లో ప్రసారమైన జబర్దస్ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఇక ఆ షోకు అంత బాగా ప్రేక్షకాదరణ మరియు రేటింగ్స్ రావడానికి యాంకర్ గా అనసూయ ఉండడం కూడా కొంత కారణం అని చెప్పవచ్చు. 

ఇక ఇటీవల ఆమె పోషించిన రంగస్థలంలోని రంగత్త పాత్ర, అలానే యాత్ర సినిమాల్లోని ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించడంతో ఆమెకు సినిమా అవకాశాలు కూడా బాగా పెరిగినట్లు సమాచారం. ఇకపోతే ఎప్పటికపుడు తన షోలు మరియు వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసే అనసూయ, కాసేపటి క్రితం ఒక పాము వీడియో ని షేర్ చేసారు. ఇప్పటివరకు మనం ఏదైనా జంతువులు నీళ్లు తాగడం, లేదా ఎవరైనా వాటికి నీళ్లు తాగించడం వంటివి చూసాము. అయితే అనసూయ షేర్ చేసిన వీడియోలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్, ఒక నాగుపామును దగ్గరుండి మరీ నీటిని తాగించడం చూడవచ్చు. నిజానికి మనం ఈ తరహా వీడియోను ఇప్పటివరకు చూడలేదని చెప్పాలి. 

ఎందుకంటే పాము మనిషిని చూస్తేనే ఆమడ దూరం పారిపోతుంది, అంతేకాక మనం కూడా ఎంతో భయపడి పారిపోతాం. మరి అటువంటిది, పామును మచ్చిక చేసుకోవడమే కాక, దానిని ఒక చంటిబిడ్డవలె దగ్గరకి తీసి, తన వద్దనున్న బాటిల్ లోని నీళ్లను తాగించిన ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని అందరూ ఎంతో మెచ్చుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా అనసూయ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: