మంచి నటుడిగా ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న పోసాని కృష్ణ మురళి లేటెస్ట్ గా తెలుగు సినిమా దర్శక నిర్మాతలపై చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితులను వివరిస్తూ పోసాని ఈ వ్యాఖ్యలు చేసాడు. మొదటి నుంచి వైసీపీ అధినేత జగన్‌ కి వీరాభిమాని అయిన పోసాని ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన విషయం తెలిసిందే.   

ఎన్నికలలో  వైసీపీ విక్టరీ సాధించడంతో ఖుషీగా ఉన్న పోసాని ఈ విషయంలో తాను దేముడుకు మొక్కుకున్న మొక్కులు అన్నీ తీర్చివేసి  తిరిగి సినిమాల్లో నటించేందుకు రెడీ అయినప్పటికీ  తాను  వైసీపీకి అనుకూలంగా ఉండటం కారణంగా ఇదివరకులా తనకు సినిమా అవకాశాలు రావడంలేదని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు  తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువ‌గా తెలుగుదేశం సానుభూతి పరులు ఉన్న నేపధ్యంలో వారంతా    త‌న‌కు ఆఫ‌ర్లు రాకుండా చేస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు పోసాని చేస్తున్నాడు.  

ఈ మధ్యనే తనకు ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చినప్పటికి కొందరు కావాలనే ఆ దర్శకనిర్మాతలను  తప్పుదోవ పట్టించి తనకు అవకాసం రాకుండా చేసారు అన్న సంచలన విషయాన్ని పోసాని బయట పెట్టాడు. ఈ నేపధ్యంలో పోసాని ఒక బడా నిర్మాత పేరు కూడ ప్రస్తావించడం తెలుగు సినిమా పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దీనితో పోసాని చేసిన కామెంట్స్ పై ఇప్పుదు ఇండస్ట్రీ వర్గాలలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అయితే పోసాని కామెంట్స్ పై మరికొందరు మరొక కోణంలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పోస్ట్ ల ఎంపిక జరుగుతున్న నేపధ్యంలో జగన్ దృష్టిలో పడి తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రచారం చేయడం వల్ల తనకు వచ్చిన నష్టాన్ని వ్యూహాత్మకంగా తెలియచేయడానికి ఇలా పోసాని కామెంట్స్ చేసి ఉంటాడు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి పోసాని కామెంట్స్ పై ఇండస్ట్రీ వర్గాలు ఎలా స్పందిస్తారో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: