సాయి కుమార్ తనయుడు ఆది ప్రేమకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా సినిమాలైతే చేస్తున్నాడు కాని ఇప్పటివరకు హీరోగా నిలబడటానికి ఒక్కటంటే ఒక్క హిట్టు లేదు. ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమా యావరేజ్ గా ఆడాయి. అందుకే కొద్దిపాటి గ్యాప్ తీసుకుని ఈసారి హిట్టు కొట్టాలన్న కసితో వస్తున్నాడు ఆది సాయి కుమార్.


డైమండ్ రత్నబాబు డైరక్షన్ లో ఆది సాయి కుమార్ హీరోగా వస్తున్న సినిమా బుర్ర కథ. టీజర్ తో మెప్పించిన ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ఎన్నో సినిమాలకు రైటర్ గా పనిచేసిన డైమండ్ రత్న బాబు డైరక్టర్ గా చేస్తున్న మొదటి ప్రయత్నమే బుర్ర కథ సినిమా.


ఈ సినిమా ట్రైలర్ చూస్తే కచ్చితంగా ఆదికి హిట్టు దక్కేలా ఉంది. మిస్త్రీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ దీపాల, కిశోర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తపరిచారు.


ఇక ఈ సినిమాలో థర్టీ ఇయర్స్ పృధ్వి ప్రభాస్ సాహో డైలాగ్ ను పట్టేశాడు. ఫ్యాన్స్ డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ ప్రభాస్ సాహోలోని పవర్ ఫుల్ డైలాగ్ ను పృధ్వి కామెడీతో చెప్పడం అలరించింది. మరి ఆది సాయి కుమార్ కు ఈ బుర్రకథ అయినా హిట్టు తెచ్చి పెడుతుందేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: