అర్జున్‌రెడ్డి! టాలీవుడ్‌ని కుదిపేసిన సినిమా. హీరో విజయ్ దేవరకొండను రాత్రికి రాత్రే స్టార్‌ని చేసిన సినిమా. సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చి ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇది. ఈ సంచలన విజయం -అటు తమిళం, హిందీలోనూ రీమేక్ అయ్యింది. హిందీలోనూ సందీప్ వంగా ‘కబీర్ సింగ్’ పేరిట షాహిద్ కపూర్, కైరా అద్వానీతో తెరకెక్కించాడు. అక్కడా సినిమాకు మంచి టాక్ వచ్చింది.

 

బాలీవుడ్ ప్రాజెక్టు పూర్తయింది కనుక, సందీప్ తెరకెక్కించనున్న నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది. అయితే, సందీప్ మళ్లీ విజయ్‌తోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్లాన్ చేశాడట. వాస్తవానికి - మహేష్‌తో ఓ ప్రాజెక్టుకు ప్లాన్ చేశాడు సందీప్.

 

కథ విషయంలో వీరిద్దరికీ సెట్ కాలేదు. మరో కథ కోసం సందీప్ చూస్తుండగానే, హిందీలో కబీర్ సింగ్ ఆఫరొచ్చింది. ఆ ప్రాజెక్టుతో బిజీ అయిపోయాడు. ఇపుడు కబీర్‌సింగ్ హిట్టవ్వడంతో నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ఒకవేళ మహేష్‌తో సందీప్ సినిమా చేసే అవకాశం ఉన్నా, దానికి చాలా టైం పట్టేలానే ఉంది. మహేష్ తాజాగా అనిల్ రావిపూడితో సెట్స్‌పైకి వెళ్లనున్నాడు.

 

అది కాస్త, పూర్తికాగానే స్టార్ డైరెక్టర్లు సుకుమార్, త్రివిక్రమ్, రాజవౌళి.. ఇలా లైన్‌లో ఉన్నారు. ఈ పరిస్థితిని చూసే -సందీప్ మళ్లీ విజయ్‌తో ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నాడట. ఇద్దరి మధ్యా కథా చర్చలు జరుగుతున్నాయని టాక్. మళ్లీ ఈ కాంబినేషన్ సెట్టయితే -అర్జున్‌రెడ్డిని మించిన చిత్రం ఉంటుందా? అన్న ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: