క్రిష్ణ వంశీ కి క్రియేటివ్ డైరెక్టర్ గా పేరుంది. ఆయన చాలా సినిమాలు తీసి హిట్లు కొట్టారు. అయితే కాలం కలసిరాక ఆయన వెనకబడిపోయారు. నక్షత్రం  మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే  అది డిజాస్టర్ అయింది. దాంతో చాలా కాలంగా సీన్ లో లేకుండా పోయారు.


మధ్యలో బాలయ్యతో రైతు మూవీ, అలాగే చిరంజీవితో మరో మూవీ ప్లాన్ చేసినా కూడా ఎందుకో వర్కౌట్ కాలేదు. ఇపుడు క్రిష్ణ వంశీ లేటేస్ట్ గా రుద్రాక్ష పేరుతో ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నట్లుగా న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీని చాలా జాగ్రత్తగా తీయాలని క్రిష్ణ వంశీ  అన్నీ సెట్ చేసుకున్నాడట.


ఈ మూవీ కధను విన్న దిల్ రాజు చాలా బాగుంది అంటూ చెప్పడంతో ఫుల్ ఎన‌ర్జీతో రంగంలోకి దిగిపోతున్నాడు. అన్నట్లు ఈ మూవీని బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఆయన ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ తో మూవీ తీయాలనుకుని ప్రయత్నం చేసి ఆగిపోయారు. ఈ మూవీతో మళ్ళీ హిట్ కొట్టాలని అటు బండ్ల, ఇటు వంశీ హార్డ్ గా ట్రై చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: