యువ హీరో నితిన్ తన సినిమాల స్పీడ్ పెంచాడని తెలుస్తుంది. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న నితిన్ ఒకేసారి 3 సినిమాలు లైన్ లో పెట్టాడు. రీసెంట్ గానే వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లిన నితిన్ ఆదివారం చంద్రశేఖర్ ఏలేటి సినిమా ముహుర్తం పెట్టుకున్నాడు.  


నిన్న సర్ ప్రైజ్ ఇచ్చాడో లేదో ఈరోజు మరో సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. నితిన్ తో వెంకీ అట్లూరి సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి. ఆ సినిమా కూడా షురూ చేశాడు నితిన్. తొలిప్రేమతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి సెకండ్ మూవీగా చేసిన మిస్టర్ మజ్ను ఆశించిన స్థాయిని అందుకోలేదు. 


నితిన్ తో వెంకీ అట్లూరి చేస్తున్న సినిమాకు రంగ్ దే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. నేను శైలజా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఇక్కడ యూత్ ఆడియెన్స్ కు తెగ నచ్చేసింది. మహానటి సినిమాతో మెస్మరైజ్ చేసిన కీర్తి తెలుగులో స్టార్ హీరోయిన్ అయ్యేందుకు కృషి చేస్తుంది.  


నితిన్ భీష్మలో రష్మికతో రొమాన్స్ చేస్తుండగా.. చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ చూస్తుంటే నితిన్ మళ్లీ ఫాంలోకి వచ్చినట్టే అనిపిస్తుంది. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: