'రాగల 24 గంటల్లో' చిత్రం ఆద్యంతం థ్రిల్లర్ కాదని, నవ్వులు పండిస్తూనే...అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తుందని హీరో శ్రీరామ్ అన్నారు. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో శ్రీ నవహాస్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం .సత్యదేవ్, ఈషా రెబ్బ, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ముఖ్య పాత్రల్లో నటించారు.
హీరో శ్రీరామ్ ముఖ్య పాత్రలో నటించారు. శ్రీనివాస్ కానూరు నిర్మాత. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్స్లో నిర్వహించారు. హీరోయిన్ ఈషా రెబ్బ, హీరో శ్రీరామ్, గణేష్ వెంకట్రామన్, నటుడు కృష్ణ భగవాన్లతో పాటు తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
సత్యదేవ్ మాట్లాడుతూ 'ఈ టైటిల్ చూస్తుంటే మనకు బాగా తెలిసిందే .. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ మనం వాతావరణం గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు ఇదే డైలాగ్ చెబుతారు. అదెంత పాపులర్ అన్నది మనకు తెలుసు. ఇప్పుడు అదే క్రేజీ టైటిల్ని తీసుకుని ఓ ఆసక్తికర కథను శ్రీనివాస్ రెడ్డి గారు అద్భుతంగా తెరకెక్కించాడు. అని పేర్కొన్నారు.
హీరోయిన్ ఈషా రెబ్బా మాట్లాడుతూ 'ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. నా పాత్రకు చాలా ప్రాముఖ్యత, నటనకు చాలా ఆస్కారం ఉంటుంది. ఇంత మంచి కథలో నన్ను హీరోయిన్ గా ఎంపిక చేసిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెబుతున్నాను. ఈ పాత్రతో నాకు మరింత మంచి గుర్తింపు వస్తుంది అన్నారు.