టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది పూజా హెగ్డే. దాదాపు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతోంది. అందంతో సొట్టబుగ్గల నవ్వుతో కుర్రకారును పిచ్చెక్కించే పూజా హెగ్డే ఇటీవల మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో హీరోయిన్ గా నటించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.


ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. అంతేకాకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటిస్తున్న ‘వాల్మీకి’లోనూ హీరోయిన్ గా నటిస్తుంది పూజ. వీటితో పాటు బాలీవుడ్ మూవీ ‘హౌస్‌ఫుల్ 4’లోనూ నటిస్తోందీ భామ.


ఇలా తెలుగుతో పాటు హిందీలోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పూజ… తాజాగా మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే… సునీల్ శెట్టి, జాన్ అబ్రహామ్‌, ఇమ్రాన్ హ‌ష్మీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సంజయ్ గుప్తా రూపొందిస్తున్న చిత్రం ‘ముంబ‌యి సాగా’. ఇందులో ఓ క‌థానాయిక‌గా న‌టించే అవ‌కాశం పూజ‌కి ద‌క్కింద‌ని బాలీవుడ్ ఖ‌బ‌ర్‌. త్వ‌ర‌లోనే పూజ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న‌ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.



మరింత సమాచారం తెలుసుకోండి: