టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా తమ సత్తా చాటుతున్నారు.  తన గొంతుతో ఎంతో మంది స్టార్ హీరోలకు డబ్బింగ్ చెప్పిన సాయి కుమార్ తనయుడు ఆది సాయికుమార్ ‘ప్రేమ కావాలి’సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.  మొదటి సినిమాతో మంచి నటుడిగా తెలుగు ప్రేక్షకులకు మనసు దోచాడు ఆది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా పేరు మాత్రం తెచ్చుకోలేకపోయాడు. 

తాజాగా ఆది సాయికుమార్ ద్విపాత్రాభినయం చేస్తోన్న సినిమా 'బుర్రకథ'. డైమండ్ రత్నంబాబు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు రానటువంటి ఓ ప్రయోగాత్మక మూవీ అంటున్నారు చిత్ర యూనిట్.  ఈ మూవీలో ఆది  రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు..అభి, రామ్.  అభి అల్లరిచిల్లరిగా తిరిగా కుర్రాడి పాత్రలో కనిపిస్తుంటే.. రామ్ మాత్రం భక్తి, సన్యాసం అంటూ సాధువులా కనిపిస్తున్నాడు.

 'రామాయణంలో రాముడి శత్రువు రావణాసురుడు.. కృష్ణుడి శత్రువు కంసుడు.. కానీ నా శత్రువు నాతో ఉన్నాడు' అంటూ ఆది చెబుతోన్న డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. అంటే ఒకే మెదడు కానీ రెండు భిన్న కోణాల ఆలోచనలు అంటూ ఈ ట్రైలర్ లో చూపిస్తున్నారు. జూన్ 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: