సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కి అసిస్టెంట్ డైరెక్టర్లు గా పూరి జగన్నాథ్, కృష్ణ వంశి కొంత కాలం పని చేసిన తర్వాత ఇద్దరు దర్శకులుగా మారారు.  ఆ మద్య కాలంలో కృష్ణ వంశి తీసిన సినిమాలకు ఎంతో ప్రత్యేకత ఉండేది.  నిన్నే పెళ్లాడుతా సినిమాలో కుటుంబం, ప్రేమ ఎంతో చక్కగా చూపించారు.  ఖడ్గం సినిమాలో దేశ భక్తి పెంపోందించేలా చేశారు. ఇలా ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను చాటుకుంటున్న కృష్ణ వంశికి కొంత కాలంగా వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి.

గతంలో కృష్ణవంశీ-బండ్ల గణేష్ కాంబినేషన్ లో 'గోవిందుడు అందరివాడేలే' సినిమా తెరకెక్కింది. కానీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు..పైగా మెగాస్టార్ అబ్బాయితో ఇలాంటి సినిమా తీశాడేంటని ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.  'నక్షత్రం' సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ మెగాఫోన్ పట్టలేదు కృష్ణవంశీ. ఇంతకాలం సమయంలో తీసుకొని కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణవంశీ-బండ్ల గణేష్ కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతుందట.  'నక్షత్రం' కంటే ముందు కృష్ణవంశీ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలనుకున్నాడు.


'రుద్రాక్ష' అనే టైటిల్ కూడా బయటకి వచ్చింది. ఇప్పుడు అదే కథను కాస్త మార్చి తెరపైకి తీసుకొస్తున్నారని సమాచారం. నిర్మాత దిల్ రాజు కథ విని బాగుందని చెప్పడంతో ఈ సినిమాపై కృష్ణవంశీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. డేట్లు ఫైనల్ అయిన తరువాత హీరోయిన్ తో సహా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: