నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రలలో స్వరూప్ ఆర్ జె ఎస్ దర్శకత్వంలో కామెడీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మూవీ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ”. కాగా గత శుక్రవారం 'మల్లేశం, ఓటర్, స్పెషల్, ఫస్ట్ ర్యాంక్ రాజు, గజేంద్రుడు' ఇలా ఏకంగా ఐదు సినిమాలతో పోటీపడి మరి విడుదలైన ఈ చిత్రం ఎట్టకేలకూ ఆ పోటీలో విజేతగా నిలిచింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో శని, ఆదివారాల్లో సినిమాకు వసూళ్లు పెరిగాయి.
ఇప్పటి వరకూ ఈ సినిమా 1.5 కోట్ల షేర్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్లో సైతం 1,30,000 డాలర్లను కలెక్ట్ చేసింది. మొత్తానికి ఆసక్తి కరమైన కథనంతో సాగే ఉత్కంఠ రేపే ఓ మంచి కామెడీ థ్రిల్లర్ గా సినిమా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మంచి డైలాగ్ డిక్షన్ తో నవీన్ పోలిశెట్టి హీరోగా తన మొదటి సినిమాతోనే మంచి నటనను కనబర్చాడు. ఈ సినిమాను రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు.