ఒకప్పుడు మన అభిమాన నటుడ్ని చూడాలంటే కేవలం థియేటర్స్ లొనే సాధ్యం అయ్యేది కానీ ఇప్పుడు కాలం మారింది వెండి తెర సూపర్న స్టార్స్ ఇప్పుడు బుల్లి తెరను కూడా అక్రమించి,అభిమానులకు ఆనందాన్ని ఇస్తున్నారు. ఇప్పటికే కింగ్ నాగార్జున,మెగాస్టార్ చిరంజీవి,జూ ఎన్టీర్ బుల్లితెర మీద వ్యాఖ్యాతలుగా చేసి సందడి చేశారు.ఇప్పుడు ఆ వరసలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేరిపోయాడు. కాకపోతే వ్యాఖ్యాతగా కాదు.

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత "బాహుబలి" సినిమాది,ఆ సినిమాతో మన "యంగ్ రెబల్ స్టార్" ప్రభాస్ ఇండియన్ స్టార్ హీరో అయ్యాడు, అభిమానులకి తెర మీద ఎనర్జిటిక్ గా కనిపించే ప్రభాస్ ఇప్పుడు బుల్లితెర మీద సందడి చేయడానికి వస్తున్నాడు
ప్రదీప్ మాచిరాజు జీ తెలుగులో "కొంచెం టచ్ లో ఉంటేచెప్తా" ప్రోగ్రాం సీసన్4 కి ప్రభాస్ మొదటి "గెస్ట్" గా వస్తున్నాడు  అని ఫిలింనగర్ సమాచారం.ప్రభాస్ ఇప్పుడు "సాహో" లో నటిస్తున్నాడు సాహో ఈ ఏడాది ఆగస్ట్ 15 కి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.  

తెలుగులో సుమ కనకాల తర్వాత చెప్పుకోదగ్గ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, రేడియో జాకీ గా కెరీర్ ప్రారంభించి ఆచాలంచెలుగా ఎదిగి బుల్లి తెరమీద తిరుగులేని యాంకర్ అయ్యాడు అప్పుడప్పుడు వెండి తెర మీద కూడా కనిపిస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇప్పటికే "ఢీ" ప్రోగ్రాం లో సుదీర్,రష్మీ తో కలిసి చేస్తూ, "కొంచెం టచ్ లో ఉంటే చెప్తా" ప్రోగ్రాం కి అటు నిర్మాతగా ఇటు వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్నాడు."కొంచెం టచ్ లో ఉంటే చెప్తా" ఇప్పటికే 3సీసన్స్ పూర్తి చేసుకుంది, నాలుగో సీసన్ త్వరలో స్టార్ట్ అవ్వనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: