అభిమానులకి సినిమా మీద ఆసక్తి కలిగించడానికి కొత్త కొత్త వ్యూహాల్ని రచిస్తున్నారు డైరెక్టర్లు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి పూర్తయ్యే వరకు ప్రతీ విషయం సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ చేస్తుంటారు. ముందు టీజర్ అని. తర్వాత ట్రైలర్ అని అభిమానులకి సినిమా మీద ఒక అభిప్రాయానికి వచ్చేలా చేస్తారు. ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకోవడానికి  చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు.

 

హరీష్ శంకర్ ప్రస్తుతం " వాల్మీకి " అనే సినిమాకి దర్శ్కత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో  మెగా హీరో వరున్ తేజ్ నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ముకుంద తర్వాత వీరిద్దరి జోడి తెర మీద కనిపించబోతుంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. మొన్న వరుణ్ తేజ్ కి ఆక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో అతను సురక్షితంగా బయటపడ్డాడు. అయినా కూడా గ్యాప్ ఇవ్వకుండా చక చకా పనులు జరుగుతున్నాయి.

 

'వాల్మీకి' సినిమా ప్రీటీజర్ ని సోమవారం సాయంత్రం 5:18 గంటలకు విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ప్రీటీజర్ చూపించడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు  చెప్పారు.అయితే ఇది కేవలం ప్రీటీజర్ మాత్రమేనని ఎలాంటి డైలాగ్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'జిగార్తండ' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు

 

ఈ సినిమాలో తమిళ హీరో ఆదర్వా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫ్ ౨ సినిమా విజయం ద్వారా మంచి జోష్ మీదున్న వరుణ్ తేజ్ కి " వాల్మీకి" విజయాన్ని ఇస్తుందో లేదో చూడాలి. అలాగే హరీష్ శంకర్ కి కూడా ఈ సినిమా కీలకం కానుంది. రీమేక్ లు బాగా తీసే ఈ దర్శకుడు హిట్ కొడతాడని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: