అటు టాలీవుడ్..ఇటు రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  టాలీవుడ్ లో రచయితగా ప్రవేశించి.. దర్శకుడిగా మారి ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు పోసాని కృష్ణ మురళి.  అయితే నటుడిగా మంచి పేరు వచ్చిన తర్వాత రాజకీయల వైపు దృష్టి మరల్చారు.  వాస్తవానికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు పోసాని.  తర్వాత కొంత కాలం రాజకీయాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన ఆ మద్య వైసీపీ పార్టీకి తన పూర్తి మద్దతు ఇవ్వడం మొదలు పెట్టారు. 

ప్రస్తుతం ఏపిలో వైసీపీ పాలనలోకి వచ్చింది..ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు.  ఈ మద్య పోసానికి ఆపరేషన్ అయిన విషయం తెలిసిందే.  ఈ సందర్భంగా ఓ ఛానల్ వారు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకున్న సందర్భంగా ఎన్నో సంచలన విషయాలు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని తిట్టానని, చంద్రబాబుని విమర్శిస్తున్నాననే కారణంతో తనకు అవకాశాలు రాకుండా చేశారని. 

లిస్ట్ లో తన పేరుని కూడా కొట్టేయించారని అందులో ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ కూడా ఉన్నారని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇప్పటి వరకు అశ్వనిదత్ పై ఎలాంటి అపోహలు, ఆరోపణలు లేవని మరి పోసాని చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎలాంటి స్పందన తెలియజేస్తారో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: