టాలెంటెడ్ హీరోయిన్  ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయే అన్న సంగతి  తెలిసిందే. ఇప్పటికే పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్  మొదటిసారి డైరెక్ట్ గా  చేస్తోన్న తెలుగు సినిమా  ‘కౌసల్య కృష్ణమూర్తి..ది క్రికెటర్‌’.  కాగా ఈ సినిమా పట్ల చాలా ఇనెట్రస్టింగ్ గా ఉన్నానని తెలుగు సినిమాలో నటిస్తోన్నందుకు చాలా అనంద పడుతున్నానని.. ఖచ్చితంగా ఈ సినిమాతో ఆకట్టుకుంటానని ఐశ్వర్య రాజేష్ వ్యక్తపరుస్తోంది.  ఇక నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాను  భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తోన్నారు. 


క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.  కాగా విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో  లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న ఈ విభిన్న చిత్రం  అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుందట. పైగా  ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేస్తున్నారు. ఇక తమిళ హీరో శివ కార్తికేయన్‌ ఈ సినిమాలో  ఓ  స్పెషల్‌ రోల్‌ చేయడం విశేషం. 



మరింత సమాచారం తెలుసుకోండి: