శైలజారెడ్డి అల్లుడు సినిమా ఫ్లాప్ తరువాత దర్శకుడు మారుతి మళ్ళీ ఒక కొత్తరకమైన కాన్సెప్ట్‌తో చేయబోతున్న సినిమా ''ప్రతి రోజూ పండుగే''. గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లతో ఢీలా పడినప్పటికి చిత్రలహరి సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందే ఈ సినిమా ఫిలింనగర్ టెంపుల్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. గతంలో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీం లో నటించిన రాశీ ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా ప్రారంభోత్సవానికి అల్లు అరవింద్, దిల్ రాజు, సాయి ధరమ్ తేజ్, రాశీఖన్నా, బన్నీవాస్ తదితరులు హాజరయ్యారు. ఇక సినిమాను అల్లు అరవింద్, యు వి వంశీ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గతంలో ఇదే భాగస్వామ్యంలో నాని-మారుతి-లావణ్య త్రిపాటి కాంబినేషన్‌లో భలే భలేమగాడివోయ్ లాంటి హిట్ సినిమాను నిర్మించారు. 
 
అటు హిట్ నిర్మాణ భాగస్వామ్యం, ఇటు హిట్ పెయిర్, అన్నీ కలిసి సినిమాకు శుభసూచకంగా వున్నాయని చిత్ర యూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. మారుతి డైరక్షన్ లో ఫ్యామిలీ జోనర్ లో కంప్లీట్ ఫీల్ గుడ్ జోనర్ లో ''ప్రతి రోజూ పండగే' రెడీ కాబోతోంది. మరి మారుతి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ కి హిట్టిస్తాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: