క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ పేరు చెప్పగానే సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. అంతేకాదు ఇండస్ట్రీలో క్రియోటివ్ గా సినిమాలు తీసే డైరెక్టర్స్ ని వేళ్ళ మీద లెక్క పొట్టొచ్చు. అలాంటి వాళ్ళలో కృష్ణ వంశీ ముందు ఉంటారన్న విషయం అటు ఇండస్ట్రీతో పాటు ఇటు ప్రేక్షకుల్లోను గట్టిగా ఉంది. అలాంటి కృష్ణ వంశీ మంచి హిట్ సినిమా తీసి చాలా ఏళ్ళే అయింది. ఆ మధ్య గోవిందుడు అందరి వాడేలే అనే సినిమా తీసినా అది అంత పెద్ద కమర్షియల్ సక్స స్ కాలేదు. అందుకే చాలా గ్యాప్ తరువాత మళ్లీ డైరక్టర్ సీట్ లోకి వస్తున్నారు. 


రుద్రాక్ష అనే సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ సినిమాకు మరో విశేషం ఏమిటంటే, ఒకప్పుడు భారీ సినిమాలు తీసిన నిర్మాత బండ్ల గణేష్ చాలా గ్యాప్ తరువాత నిర్మాతగా రాబోతున్నారని లేటెస్ట్ న్యూస్. ఈ ఇద్దరు కలిసి గతంలో గోవిందుడు అందరి వాడేలే అనే సినిమాను అందించిన సంగతి తెలిసిందే. ఇక రుద్రాక్ష సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. టాప్ హీరోయిన్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ముఖ్యంగా కాజల్ అగర్వాల్ పేరు వినిపిస్తున్నట్లు టాక్. 


ఒకవేళ హీరోయిన్ గనక ఓకె అయితే సినిమా అనౌన్స్ మెంట్ బయటకు వస్తుందట. కృష్ణ వంశీ చాలా టైమ్ తీసుకుని, పూల్ ఫ్రూఫ్ స్క్రిప్ట్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్క్రిప్ట్ ను నిర్మాత దిల్ రాజు కూడా విని బాగుందని మెచ్చుకున్నట్లు ఫ్రెష్ అప్‌డేట్. అతి త్వరలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. మరి ఈ క్రియోటివ్ డైరెక్టర్ ఈ సినిమాతోనైనా మళ్ళీ మాంచి కమర్షియల్ హిట్టిస్తాడో లేదో చూడాలి. ఎలాగు కృష్ణ వంశీ చెప్పిన కథ దిల్ రాజు కు కూడా బాగా నచ్చింది కాబట్టి ఒకవేళ బండ్ల గణేష్ వెనక్కి తగ్గినప్పటికి ఈ ప్రాజెక్ట్ దిల్ రాజు స్టార్ట్ చేసే ఛాన్స్ కూడా ఉందని ఫిల్మ్ నగర్ సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: