బిగ్ బాస్ 3 సీజన్ త్వరలో మొదలవబోతోంది. అందరు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ షోకు సంబంధించి రీసెంట్ గా లాంఛ్ చేసిన ప్రోమో ఆకట్టుకోవటమే కాదు.. షో మీద భారీగా అంచనాలు పెరిగేలా చేసింది. సిరీస్-3 కు కింగ్ నాగార్జున యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి హౌస్ లో పాల్గొనే వాళ్ళు కూడా తమ గ్లామర్ తో అట్రాక్ట్ చేయటం ఖాయమంటున్నారు. అంతేకాదు ప్రముఖ యాంకర్లు శ్రీముఖి.. లాస్య ఇద్దరూ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. 


ఇక ఈ షోలో వరుణ్ సందేశ్, వేణు లాంటి నటులు..ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా ఉండబోతున్నారని చెబుతున్నప్పటికి అధికారిక కన్ఫర్మేషన్ మాత్రం ఇంకా రాలేదు.
ఇదిలా ఉంటే.. శ్రీముఖి.. లాస్యలకు భారీ పేమెంట్ ఇచ్చి మరీ బిగ్ బాస్ 3కి ఓకే చేయించినట్లుగా ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం బిగ్ బాస్ షోకు ఓకే చెప్పేందుకు  శ్రీముఖికి రూ.50 లక్షలు.. లాస్యకు రూ.30 లక్షలు ఇచ్చినట్లుగా ఫ్రెష్ అప్‌డేట్. అది కూడా సింగిల్ పేమెంట్ అట.


షోలో ఎంత కాలం ఉన్నా.. వీళ్ళకి మాత్రం ఈ అమౌంట్ హౌస్ లోకి వెళ్లే ముందే అందుతుందని చెబుతున్నారు. ఒకవేళ.. వీళ్ళే గనక ఫైనలిస్ట్ లు అయితే.. రెమ్యునిరేషన్ కు అదనంగా ప్రైజ్ మనీ ఉంటుందన్న ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంత భారీ మొత్తాన్ని ఇస్తూ షో చేయటం చూస్తే.. ఈసారి షోను భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు లాస్ట్ సీజన్ అంత గా సక్సస్ అవకపోవటంతో ఈ సారీ నాగ్ మానియాతో బిగ్ బాస్-3 ని సూపర్ సక్సస్ చేయాలని టీం పక్కగా ప్లాన్ చేస్తున్నట్లు న్యూస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: