సూపర్ స్టార్ మహేష్ రీసెంట్ గా మహర్షి అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడితో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది.


పటాస్ నుండి ఎఫ్-2 వరకు చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ కొట్టిన అనీల్ రావిపుడి మహేష్ తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కాబట్టి సరిలేరు నీకెవ్వరు మీద అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. ఎలాగు సూపర్ హిట్ కాంబినేషన్ కాబట్టి సినిమా పక్కా హిట్ అన్న నమ్మకంతో ఉన్నారు.


అందుకే మహేష్ సినిమాకు ముందే బిజినెస్ చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే శాటిలైట్ రైట్స్ జెమిని టివి వారు 16.50 కోట్లకు డీల్ ఓకే చేసుకున్నారట. మహేష్ మహర్షి సినిమా 12 కోట్లకు కొన్న జెమిని ఛానెల్ ఈసారి 4 కోట్లు ఎక్కువగా ఈ సినిమాను కొనేసింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కూడా 100 కోట్లు చేయడం పక్కా అంటున్నారు.


ఇక డిజిటల్ రైట్స్, హింది డబ్బింగ్ రైట్స్ అన్ని కలిపి ఈసారి మహేష్ 200 కోట్లకు టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ డైరక్టర్ అనీల్ రావిపుడి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు హామీ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు 200 కోట్లు పక్కా వసూళ్లు చేస్తుందని అన్నాడు. మరి బిజినెస్ ఆ రేంజ్ లో ఉంటే కలక్షన్స్ కూడా దానికి తగినట్టుగానే ఉంటాయి. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపిస్తాడట. సినిమాలో విజయశాంతి స్పెషల్ రోల్ చేస్తుందని తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: